Tickets: ఈ నెల 23న విశాఖలో టీమిండియా-ఆసీస్ టీ20 మ్యాచ్... రేపటి నుంచి టికెట్ల అమ్మకం
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు వివిధ వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబరు 23న జరిగే తొలి టీ20 మ్యాచ్ కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో, నవంబరు 15, 16 తేదీల్లో ఆన్ లైన్ లో 10 వేల టికెట్లు విక్రయించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి పేటీఎంలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. నవంబరు 17, 18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11 వేల టికెట్లు విక్రయించనున్నారు.