దీపావళి సందర్భంగా అగ్నిప్రమాదం..లండన్లో భారత సంతతి కుటుంబం ఆహుతి
- పశ్చిమ లండన్లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం
- అగ్ని కీలల్లో పడి ఆరుగురి మృతి, మరొకరికి గాయాలు
- ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతులది ఒకే కుటుంబమని పోలీసుల గుర్తింపు
- అగ్నిప్రమాదానికి బాణసంచా పేలుడు కారణమో కాదో ఇప్పుడే చెప్పలేమన్న అధికారులు
టపాసులు కాల్చడమే ఈ ప్రమాదానికి కారణమా అన్న ప్రశ్నకు పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు. ‘‘ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రికి చేరుకోగా, ఇంట్లో ఆరుగురి మృత దేహాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించారు. వారి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక ఆరో వ్యక్తి ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనక కారణాలు తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.