వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
- బుధవారం ఉదయం ఒంగోలులో జరిగిన ప్రమాదం
- బైక్పై వెళ్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
- ఎంపీ ప్రయాణిస్తున్న వాహనమే ఢీకొట్టిందని చెబుతున్న స్థానికులు
పేర్నమిట్ట సమీపంలో ఉన్న పొగాకు వేలం కేంద్రం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితుడికి తీవ్రమైన గాయాలవ్వడంతో హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. బాధితుడు నాగేశ్వరరావు బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతలకు చెందినవాడని, పేర్నమిట్టలోని ఓ రైస్మిల్లులో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.