దసరా సెలవుల కోసం ఇంటికొచ్చి గుండెపోటుతో మరణించిన ఏడో తరగతి బాలిక
- నిజామాబాద్లో ఘటన
- మోపాల్లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక
- సెలవులకు ఇంటికొచ్చి చాతీలో నొప్పిగా ఉందన్న విద్యార్థిని
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి చాతీలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే బాలిక మరణించినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.