అమిత్ షా తనయుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో చెప్పాలి: కేటీఆర్
- అదిలాబాద్ సభలో అమిత్ షా అన్నీ అబద్ధాలే చెప్పారన్న కేటీఆర్
- బీజేపీకి మరోసారి 110 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని వ్యాఖ్య
- పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు వెక్కిరిస్తున్నారన్న మంత్రి
పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు వెక్కిరిస్తున్నారన్నారు. బీసీసీఐ పదవిలో ఉన్న అమిత్ షా తనయుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజాశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షాకు లేదన్నారు. పదేళ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.