ఏషియన్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట.. చిరస్మరణీయ విజయమన్న ప్రధాని
- 100 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్
- 25 బంగారం పతకాలు, 35 వెండి పతకాలు
- అథ్లెట్లకు అభినందనలు తెలియజేసిన ప్రధాని
దీన్ని చిరస్మరణీయ విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పురస్కారాలను భారత్ కు తీసుకొచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఏషియన్ గేమ్స్ లో భారత్ కు చిరస్మరణీయ విజయం. నూరు మెడళ్ల మైలురాయిని చేరుకున్నందుకు భారతీయులు ఉద్వేగానికి గురవుతున్నారు. మన అసాధారణ క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. వారి కృషితోనే భారత్ ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడాకారుల బృందానికి ఈ నెల 10న ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఏషియన్ గేమ్స్ లో అత్యధికంగా 354 పతకాలతో చైనా ముందుంది. జపాన్ 169, దక్షిణ కొరియా 170 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.