Team India: టీమిండియాతో చివరి వన్డే... భారీ స్కోరు దిశగా ఆసీస్

Aussies sails towards huge total against Team India in third ODI
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు చివరి వన్డే రాజ్ కోట్ లో జరుగుతోంది. ఇప్పటికే టీమిండియా ఈ సిరీస్ ను 2-0తో చేజిక్కించుకోగా, ఆసీస్ నేటి మ్యాచ్ లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. 

ఈ క్రమంలో, టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ టీమిండియా బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించారు. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. కుల్దీప్ బౌలింగ్ లో మార్ష్ అవుటయ్యాడు. వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. 

వన్ డౌన్ లో వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా దూకుడుగా ఆడడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 74 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు కాగా... క్రీజులో లబుషేన్, గ్రీన్ ఉన్నారు. 

టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ సాధించారు. కాగా, తొలి రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు.
Go Back to Shorts
Team India
Australia
3rd ODI
Rajkot

More Telugu News