భారత్తో వివాదం.. కెనడాకు నిప్పుతో చెలగాటమే!: అంతర్జాతీయ నిపుణులు
- భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో అంతర్జాతీయంగా ఆందోళన
- ట్రూడోపై అమెరికా నిపుణుల విమర్శలు
- భారత్తో వివాదం నిప్పుతో చెలగాటమని వ్యాఖ్య
- ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని సూచన
ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంత మంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని ఈ కార్యక్రమంలో నిపుణులు మండిపడ్డారు. ఖలిస్థానీ నేత హత్యను భారత నిఘావర్గాలకు అంటగడుతూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ఇది ట్రూడోకు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినా నాయకత్వ లక్షణం మాత్రం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోరాదని తాము భావిస్తున్నామని తెలిపారు. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని వ్యాఖ్యానించారు.
ఇక తాజా వివాదంతో అమెరికా పెద్ద ఇరకాటంలో పడింది. సన్నిహిత మిత్రదేశమైన కెనడా ఓవైపు, వ్యూహాత్మక భాగస్వామి భారత్ మరోవైపు ఉండటం అమెరికాకు తలనొప్పిగా మారింది.