విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు... కిషన్ రెడ్డి వివరణ!
- ప్రధాని మోదీ ఎవరినీ విమర్శించలేదన్న కిషన్ రెడ్డి
- విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా నిలిచిన అంశాలనే ప్రస్తావించారని వెల్లడి
- ఆనాడు పెప్పర్ స్ప్రే ఉపయోగించలేదా, పార్లమెంట్ తలుపులు మూయలేదా? అన్న కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం... నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ లక్ష్యాన్ని దెబ్బతీసిందన్నారు. గతంలో ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో అధికారం పంచుకుందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ తెలంగాణను ఆలస్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ను దంచి ప్రజలు తెలంగాణను తెచ్చుకున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి, తెలంగాణను సాధించారన్నారు.