Anantnag Encounter: అనంత్‌నాగ్‌లో ఆరో రోజూ కొనసాగుతున్న ఎన్‌కౌంటర్.. కాలిన ఉగ్రవాది మృతదేహం స్వాధీనం

Anantnag encounter Charred body of terrorist recovered
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వరుసగా ఆరో రోజూ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు కాలిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అది ఉగ్రవాదిదే అయి ఉంటుందని భావిస్తున్నారు. డ్రోన్ ద్వారా ఆ ప్రాంతంలో గుర్తించిన ఉగ్రవాది, సైనికుడి మృతదేహాల కోసం ఈ తెల్లవారుజామున భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి కొనసాగిస్తున్నాయి. 

ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం కూడా తీవ్రస్థాయిలో కాల్పులు కొనసాగాయి. అయితే, నేడు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కాల్పులు జరగలేదు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతాధికారులు అమరులయ్యారు. వీరిలో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ మేజర్ ఆశిష్ ధోంచక్, డీఎస్పీ హుమయూన్ భట్, మరో సైనికుడు అమరులయ్యారు.
Go Back to Shorts
Anantnag Encounter
Jammu And Kashmir
Lashkar-e-Taiba

More Telugu News