ట్రంప్ తో కలసి గోల్ఫ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ
- అమెరికా పర్యటనలో అరుదైన అవకాశం
- యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ కు హాజరైన ధోనీ
- ఆ మరుసటి రోజే ట్రంప్ తో గోల్ఫ్ గేమ్
‘‘అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రప్ ఎంఎస్ ధోనీ కోసం గోల్ఫ్ ఆటను ఏర్పాటు చేశారు. అమెరికాలోనూ తలా ఫీవరే’’ అంటూ ఓ యూజర్ ట్విట్టర్ పై (ఎక్స్) పోస్ట్ చేశారు. ధోనీ గ్రే కలర్ పాయింట్ పై బ్లూ షీటర్ట్ ధరించి ఉన్నారు. యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన ధోనీ, ఆ మరుసటి రోజు గోల్ఫ్ గేమ్ లో పాల్గొన్నారు. మొత్తం మీద ధోనీ అభిమానులకు ఈ గోల్ఫ్ గేమ్ మంచి కిక్కే ఇస్తోంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు భారత సంతతి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ట్రంప్ ధోనీతో ఈ పోటీకి తెరతీశారా? అన్న సందేహం కొందరికి కలుగుతోంది.