Aditya L1: ఆదిత్య ఎల్-1 కక్ష్యను విజయవంతంగా పొడిగించిన ఇస్రో

ISRO successfully Extends Aditya L1 earth orbit
షార్ట్స్‌లో చూడండి
సూర్యుడిని అధ్యయనం చేయడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నిన్న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. మరోవైపు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఈరోజు ఇస్రో విజయవంతంగా చేపట్టింది. దీంతో ఉపగ్రహం ఇప్పుడు 245 X 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 5న తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నట్టు ఇస్రో తెలిపింది. 

16 రోజుల పాటు ఆదిత్య ఎల్-1 భూ కక్ష్యలోనే చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని సూర్యుడిపై పరిశోధలను చేస్తుంది. ఆదిత్యలో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. వీటితో పాటు సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి శోధిస్తాయి.
Go Back to Shorts
Aditya L1
ISRO

More Telugu News