వేర్వేరు బ్యాంకులకు చెందిన 50 మంది ఖాతాల్లో వేలాది రూపాయలు జమ.. వెంటనే వేరే ఖాతాలకు మళ్లింపు
- ములుగు జిల్లా ఏటూరునాగారాంలో ఘటన
- రూ. 2 వేల నుంచి రూ. లక్ష వరకు జమ
- వెంటనే వేరే ఖాతాలకు మళ్లింపు
- ఇంటెలిజెన్స్, పోలీసుల ఆరా
ఎస్బీఐ, ఏపీజీవీబీ, కెనరా బ్యాంకు.. ఇలా వేర్వేరు బ్యాంకులకు చెందిన దాదాపు 50 మంది ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. డబ్బులు పొరపాటున వచ్చాయని అనుకోవడానికి కూడా లేదని, ఎందుకంటే నిన్న శనివారం బ్యాంకులు బంద్ అని ఖాతాదారులు చెబుతున్నారు. విషయం తెలిసిన ఇంటెలిజెన్స్ వర్గాలు, స్థానిక పోలీసులు ఆరా తీశారు.