జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ షురూ
- జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబర్ 2 నుండి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
- మొదటి విడతలో 8 ప్రాంతాల్లో 12వేలమంది అర్హులకు ఇళ్ల పంపిణీ
- డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్న తలసాని
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు గొప్పగా ఆత్మగౌరవంతో బతకాలనేదే కేసీఆర్ ఆలోచన అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్నామన్నారు. కాగా, అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, అందంగా తీర్చిదిద్దడం, పంపిణీ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.