బీజేపీ కోసం ప్రతి సంస్థలో ఆరెస్సెస్ తన వ్యక్తులను చొప్పిస్తోంది: రాహుల్ గాంధీ
- బీజేపీకి ఆరెస్సెస్ మాతృ సంస్థ అన్న రాహుల్
- కేంద్ర మంత్రులెవరు వారి శాఖలను నిర్వహించడం లేదని వ్యాఖ్య
- ఆరెస్సెస్ వ్యక్తుల సూచనల ఆధారంగానే శాఖలు నడుస్తున్నాయని ఆరోపణ
బీజేపీ కోసం ఆరెస్సెస్ అన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెడుతోందని అన్నారు. కేంద్ర మంత్రులెవరూ వారి శాఖలను నడపడం లేదని, ఆయా శాఖల్లో ఆరెస్సెస్ నియమించిన వాళ్లు వాటిని నడుపుతున్నారని చెప్పారు. వారు సూచించిన విధంగానే శాఖలు నడుస్తున్నాయని అన్నారు. శాఖల్లో ఏం జరగాలనేది వారే సూచిస్తారని... ఈ విషయాన్ని మంత్రులను అడిగినా చెపుతారని వ్యాఖ్యానించారు.