ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కావడానికి మీరు కారణం కాదా?: చంద్రబాబుకి ధర్మాన ప్రశ్న
- 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? అని ప్రశ్న
- వంశధారను డిసెంబర్ లో జాతికి అంకితం చేస్తామని వెల్లడి
- చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్న
వంశధార పనులు 77 శాతం పూర్తయ్యాయని... డిసెంబర్ లో జాతికి అంకితం చేస్తామని చెప్పారు. కిడ్నీ వ్యాధుల నిర్మూలనకు వంశధార నుంచి ఉద్ధానంకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంపై చాలా ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చంద్రబాబు అంటున్నారని... మరి, గతంలో విద్యుత్ ఛార్జీలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు.