కూలిన విమానం, భారతీయ ట్రెయినీ పైలట్ మృతి
- ఫిలిప్పీన్స్లోని అపాయోవా ప్రావిన్స్లో కూలిన విమానం
- ఘటనా స్థలాన్ని గుర్తించిన సిబ్బంది
- మృతుల కోసం తీవ్రంగా గాలింపు
- మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన విమానం
- అ తరువాత కాసేపటికే విమానం అదృశ్యం
- ఘటనలో మరణించిన భారతీయ ట్రెయినీ పైలట్ రాజ్కుమార్ కోండే
విమానం అదృశ్యమైన విషయం వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది, ఎయిర్ ఫోర్స్, పోలీసులు రంగంలోకి దిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కొన్ని గంటలకే విమానం కనిపించకుండా పోయింది. ఫిలిప్పీన్స్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.