కుటుంబంతో కలసి తమిళనాడులో రాజమౌళి పర్యటన

SS Rajamouli wife Rama and family holiday in Tamil Nadus Tuticorin
  • ఆయన వెంట భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె
  • ట్యూటికోరిన్ ప్రాంతంలో రిసార్ట్ లో బస
  • గుర్తుగా ఓ మొక్కను నాటిన దర్శకుడు
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలసి ఇటీవలే వేసవి విహారంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. రాజమౌళి వెంట ఆయన భార్య రమ, కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ, అతడి భార్య పూజ ఉన్నారు. అలాగే, కుమార్తె మయూఖ సైతం వారితో కలిసింది. వీరంతా ట్యూటికోరిన్ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు  గడిపారు. 

ఆక్వా అవుట్ బ్యాక్ అనే ప్రముఖ వాటర్ స్పోర్ట్స్ కేంద్రం వద్ద విడిది చేశారు. రాజమౌళి కుటుంబం పర్యటన ఫొటోలను సదరు రీసార్ట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తమ పర్యటనకు గుర్తుగా రాజమౌళి ఓ మొక్కను నాటారు. తిరిగి మరోసారి అక్కడకు వెళతామంటూ ఎస్ ఎస్ కార్తికేయ ప్రకటించారు. ఎస్ఎస్ రాజమౌళి సర్, రమా ఆంటీకి ఈ వారాంతంలో విడిది కల్పించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానంటూ వీరికి ఆతిథ్యం ఇచ్చిన అనైనా అనే యువతి ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొనడం గమనార్హం. 
Advertisement
SS Rajamouli
holiday visit
Tuticorin
Tamil Nadu

More Telugu News