ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదిలేదన్న ప్రధాని మోదీ
- మానవాళి మొత్తానికి టెర్రరిజం శత్రువని వ్యాఖ్య
- అమెరికన్ కాంగ్రెస్ లో భారత ప్రధాని ప్రసంగం
- స్టాండింగ్ ఒవేషన్, చప్పట్లతో మార్మోగిన సభ
అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ఘటన (9/11), ముంబైలో దాడుల (26/11) ఘటనలను ప్రస్తావిస్తూ.. రాడికలిజం, టెర్రరిజం మొత్తం ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని మోదీ పేర్కొన్నారు. అగ్రరాజ్యంలోని అత్యున్నత సభలో పాకిస్థాన్ ను పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ ప్రపంచానికి ముప్పు తొలగిపోలేదని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో మోదీని అభినందించారు. కాగా, అమెరికన్ కాంగ్రెస్ లో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండవసారి.