rbi: ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు... ఎందుకంటే..!

HC notices to RBI governor
షార్ట్స్‌లో చూడండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్ బ్యాంకు కేసులో ఆదేశాలు పాటించనందుకు గాను ఈ నోటీసులు జారీ అయ్యాయి. పాలనా వ్యవహారాలకు అధికారిని నియమించాలని గతంలో ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కానీ ఆదేశాలు అమలు కాలేదని మహేశ్ బ్యాంకు వాటాదారులు కోర్టుకు వెళ్లారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యంలో స్పందించిన న్యాయస్థానం కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. జులై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 
Go Back to Shorts
rbi
Telangana
High Court
TS High Court

More Telugu News