శవపేటికలో నుంచి లేచిన బామ్మ... ఆసుపత్రిలో చనిపోయింది!
- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు
- చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు
- శవపేటికలో ఉంచగా తట్టిన వృద్ధురాలు
- మరోసారి ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు.. చికిత్స పొందుతూ మృతి
మృతదేహాన్ని తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు శవపేటికలో ఉంచి, అంత్యక్రియలకు సిద్ధం చేశారు. ఐదారు గంటలు గడిచాక శవపేటిక నుండి ఎవరో తడుతున్నట్లుగా శబ్దం వచ్చింది. కంగారుపడిన బంధువులు, తెరిచి చూసి, ఆమె బతికి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు, రెండోసారి ఆసుపత్రిలో చేరిన ఆ వృద్ధురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది.