Jammu And Kashmir: కుప్వారాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల హతం

Five terrorists killed in Kupwara encounter
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. 

ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఈ నెల 13న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నెల 2న రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Go Back to Shorts
Jammu And Kashmir
Kupwara
Terrorists
Encounter

More Telugu News