కోల్కతా-దోహా విమానంలో బాంబు ఉందన్న ప్రయాణికుడు.. ప్రయాణికులను దించేసి స్పిఫర్ డాగ్స్తో తనిఖీ
- కోల్కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- విమానంలో బాంబు ఉందని ఫోన్ వచ్చిందన్న ప్రయాణికుడు
- తన కుమారుడికి మానసిక ఆరోగ్యం బాగోలేదన్న తండ్రి
ఆ వెంటనే విమానంలోని ప్రయాణికులందరినీ కిందికి దించి తనిఖీలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్తో అణువణువు గాలించారు. బాంబు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉన్నట్టు చెప్పిన ప్రయాణికుడిని అధికారులు ప్రశ్నించారు. విమానంలో బాంబు ఉన్నట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. అయితే, అతడి తండ్రి మాత్రం తన కుమారుడి మానసిక ఆరోగ్యం బాగోలేదని చెబుతూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు చూపించాడు. దీంతో విమానం 9 గంటలకు దోహా బయలుదేరింది.