ఒడిశా రైలు ప్రమాదం: 18 రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు
- ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు దూరప్రాంత రైలు సర్వీసుల రద్దు
- మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు
- గోవా-ముంబై ‘వందేభారత్’ రైలు ప్రారంభోత్సవం కూడా వాయిదా
కాగా, బెంగళూరు-గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగడ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్పూర్ డివిజన్లో ఉన్న చెన్నై సెంట్రల్-హౌరా (12840) రైలును జరోలీ మీదుగా, వాస్కోడగామా-షాలీమార్ (18048), సికింద్రాబాద్-షాలీమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా మళ్లించినట్టు వెల్లడించారు.
గోవా-ముంబై ‘వందేభారత్’ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశామని కొంకణ్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.