Odisha: ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్

  • ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ప్రమాద ఘటన
  • ప్రమాదంలో బోల్తాపడిన ఏడు బోగీలు
  • పలువురు ప్రయాణికులకు గాయాలు
Coromandel Express derails after collision with goods train in Odishas Balasore

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బహనాగ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

More Telugu News