YS Vivekananda Reddy: సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ ఈ నెల 5కు వాయిదా

  • సీబీఐ సీపీకి తమ న్యాయవాది సహకరించేందుకు అనుమతివ్వాలని సునీత పిటిషన్
  • ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తులు
  • సునీత పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయని భాస్కర రెడ్డి, ఉదయ శంకర్ రెడ్డి 
YS Sunitha Reddy petition in CBI court

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి తమ న్యాయవాది సహకరించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సునీత పిటిషన్ పై ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
 
ఈ పిటిషన్ పై వైఎస్ భాస్కర రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో సునీత వాదనల కోసం పిటిషన్‌పై విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది.

More Telugu News