Sensex: స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్

  • 119 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 46 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతం వరకు లాభపడ్డ టాటా స్టీల్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. రెండు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 62,547కి పెరిగింది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 18,534 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.93%), మారుతి (1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), సన్ ఫార్మా (1.37%), ఎల్ అండ్ టీ (1.19%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.58%), విప్రో (-0.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.46%), టీసీఎస్ (-0.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.40%).

More Telugu News