Siddipet District: సిద్ధిపేటలో త్రీడీ ప్రింటెడ్ ఆలయం

  • సిద్ధిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో  సిద్ధమవుతున్న ఆలయం
  • అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో 3800 అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు
  • రోబో సాయంతో మూడు భాగాలుగా ఆలయ నిర్మాణం
  • ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనన్న కంపెనీ
3d printed temple coming up in siddipet

సిద్ధిపేట శివారులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. సిద్ధిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని రోబో సాయంతో మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో శివుడు, పార్వతి, వినాయకుడి గర్భగుడులు ఉంటాయి. 

ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి. రోబోలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయం నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నామని, ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనని కంపెనీ ఎండీ జీడిపల్లి హరికృష్ణ మీడియాకు తెలిపారు.

More Telugu News