Tirumala: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

  • తిరుమలలో కొద్దిమేర తగ్గిన భక్తుల రద్దీ
  • 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • నిన్న స్వామివారిని దర్శించుకున్న 75,871 మంది భక్తులు
  • హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం 
Tirumala darshan information

తిరుమలలో భక్తుల రద్దీ గత రెండ్రోజులతో పోల్చితే కొద్ది మేర తగ్గింది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. 

నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 75,871 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News