దేశంలో డిజిటల్ చెల్లింపుల హవా.. వచ్చే ఐదేళ్లలో రోజుకి 100 కోట్లకు చేరిక!
- యూపీఐ లావాదేవీలపై పీడబ్ల్యూసీ నివేదిక విడుదల
- 2026-27 నాటికి మొత్తం డిజిటల్ చెల్లింపులు 41,400 కోట్లకు చేరిక
- ప్రస్తుతం ఏడాదికి 10,300 కోట్ల డిజిటల్ లావాదేవీలు
2022-23లో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉన్నట్టు తెలిపింది. 2026-27 నాటికి మొత్తం డిజిటల్ చెల్లింపులు 41,400 కోట్లకు చేరుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఏడాదికి 10,300 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదవుతున్నట్టు పీడబ్యూసీ నివేదిక వివరించింది.
క్రెడిట్ కార్డుల విభాగంలో కూడా ఆరోగ్యవంతమైన వృద్ధి నమోదవుతోందని, యూపీఐ తర్వాత ప్రజలు అత్యధికంగా డెబిట్, క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. 2024-25లో డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల లావాదేవీలే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. డెబిట్ కార్డులను నగదు ఉపసంహరణకు మాత్రమే వినియోగిస్తుండడం ఇందుకు కారణమని పీడబ్ల్యూసీ తెలిపింది.