స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్

Markets ends in losses
  • 208 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 62 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.57 శాతం పతనమైన టాటా మోటార్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. దీంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 61,773కి పడిపోయింది. నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 18,285కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.96%), టైటాన్ (1.05%), ఐటీసీ (1.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.01%), టెక్ మహీంద్రా (0.80%). 

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.30%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.29%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News