Sensex: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 18 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 34 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే ప్రయాణించినప్పటికీ... చివర్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్లు లాభపడి 61,982కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 18,348 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (1.75%), టాటా మోటార్స్ (1.18%), ఏసియన్ పెయింట్స్ (1.07%), ఐటీసీ (1.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.98%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.21%), టైటాన్ (-1.11%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.07%), కోటక్ బ్యాంక్ (-0.97%), ఎల్ అండ్ టీ (-0.88%).

More Telugu News