Anam Ramanarayana Reddy: చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా: ఆనం రామనారాయణ రెడ్డి

  • ఎంపీగా కాదు.. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానన్న ఆనం
  • ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా
  • ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి 60 శాతం మంది చేరతారని వ్యాఖ్య
anam ramanarayana reddy gave clarity on his competition in the next election

సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని తెలిపారు. 

రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా ఆనం స్పందించారు. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి 60 శాతం మంది వైసీపీ నుంచి చేరతారని అన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పనుల కోసం చాలా మంది ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.

More Telugu News