ఊరిస్తున్న ప్లే ఆఫ్ బెర్తు... రాజస్థాన్, పంజాబ్ అమీతుమీ
- ధర్మశాలలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
- ఇరు జట్లకు ప్లే ఆఫ్ చాన్సులు
- కీలకం కానున్న ఇతర మ్యాచ్ ల ఫలితాలు
ఈ క్రమంలో, నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు ధర్మశాలలోని హెచ్ పీసీఏ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
వీపు నొప్పితో బాధపడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ లో ఆడకపోవడం రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే, చహల్, ఆడమ్ జంపా రూపంలో ఆ జట్టులో ప్రతిభావంతులైన లెగ్ స్పిన్నర్లు ఉన్నారు. ఇక, పంజాబ్ కింగ్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు.