Saitej: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి 'విరూపాక్ష' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

  • సాయితేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'
  • తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ 
  • ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్  
Virupaksha Streaming date connfirmed

సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష' ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సుకుమార్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేశాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. 

అలాంటి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలు కానుంది. థియేటర్స్ లో తొలి రోజునే 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాలుగు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ ను నమోదు చేసింది. నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, 100 కోట్లకు చేరువలో ఉంది. 

సాయితేజ్ సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. క్షుద్రశక్తుల నుంచి ఊరును రక్షించుకోవాలా? ప్రియురాలిని రక్షించుకోవాలా? అనే పరిస్థితి ఎదురైనప్పుడు హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేదే కథ. ఓటీటీ నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News