ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం

5 children drown in Krishna Sagar Lake in Gujarats Botad
  • గుజరాత్‌లోని బోతాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • తొలుత కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడ్డ ఇద్దరు టీనేజర్లు
  • వారిని కాపాడేందుకు నీళ్లలోకి దిగిన మరో ముగ్గురు
  • దురృష్టవశాత్తూ ఐదుగురూ మృతి
గుజరాత్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం మృతి చెందారు. తొలుత నీళ్లల్లో దిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలురు నీట మునిగిపోయారు. మృతులు అందరూ 16-17 ఏళ్ల వారేనని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. 

శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్ణవశాత్తూ వారు కూడా మరణించారని బోతాద్ ఎస్పీ కిషోర్ బలోలియా పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Go Back to Shorts
Gujarat

More Telugu News