రేపటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ

Hanumajjayanthi celebrations in Tirumala
  • ఆంజనేయస్వామికి అభిషేకాలు, అర్చనలు, నివేదనలు
  • జాపాలి తీర్థంలో స్వామివారికి అభిషేకం 
  • పాపవినాశన మార్గంలో ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి
తిరుమలలోని అంజనాద్రిపై రేపటి నుండి 18వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలోని వివిధ ఆలయాల వద్ద కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఆంజనేయస్వామికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు, నివేదనలు నిర్వహిస్తారు. జాపాలి తీర్థంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. హనుమజ్జయంతి రోజైన మే 14వ తేదీన పాపనాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
hanumajjayanthi

More Telugu News