చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగంలో పాల్గొన్న జగన్
- విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో యాగం
- ఉదయం 5 గంటలకు ప్రారంభమైన యాగ కార్యక్రమాలు
- యజ్ఞ సంకల్పం తీసుకున్న జగన్
ఈ నెల 17వ తేదీ వరకు 6 రోజుల పాటు మహాయజ్ఞం కొనసాగనుంది. నాలుగు ప్రధాన యాగశాలల్లో ఒక్కో యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో యాగ కార్యక్రమాలు జరగుతున్నాయి. భక్తులు వీక్షించేలా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక క్యూ లైన్ ను వీఐపీల కోసం ఏర్పాటు చేశారు. చివరి రోజున విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞం ముగుస్తుంది.