Punjab Kings: టాస్ గెలిచిన పంజాబ్... అంతలోనే 2 వికెట్లు డౌన్

  • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × పంజాబ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
  • 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వైనం
  • రెండు వికెట్లు తీసిన కోల్ కతా పేసర్ హర్షిత్ రాణా
Punjab Kings lost two early wickets

ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆ జట్టు 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లు పేసర్ హర్షిత్ రాణా ఖాతాలోకి వెళ్లాయి. 

తొలుత ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (12)ను అవుట్ చేసిన హర్షిత్ రాణా... ఆ తర్వాత ప్రమాదకర భానుక రాజపక్స (0)ను డకౌట్ చేశాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్లకు 33 పరుగులు కాగా... క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్ (16), లియామ్ లివింగ్ స్టోన్ (1) ఉన్నారు.

More Telugu News