Vikram: 300 కోట్లకి పైగా వసూళ్లతో 'పొన్నియిన్ సెల్వన్ 2'

  • క్రితం నెల 21న విడుదలైన 'PS -2'
  • భారీ తారాగణంతో వచ్చిన చారిత్రక చిత్రం
  • ఫస్టు పార్టుకి మించిన ఆదరణ  
  • మణిరత్నం టేకింగ్ ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ 
Ponniyin Selven 2 Update

మణిరత్నం దర్శకత్వంలో .. చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా రూపొందింది. చోళ .. పాండ్య రాజుల మధ్య జరిగే యుద్ధాలతో ఈ కథ నడుస్తుంది. ఎంజీఆర్ ఈ కథను తెరపైకి తీసుకుని రావడానికి చాలా ప్రయత్నం చేశారు .. కానీ కుదరలేదు. మణిరత్నం అతికష్టం మీద ఆ కథకి దృశ్య రూపాన్ని ఇవ్వగలిగారు. 

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ పార్టుకి ఒక్క తమిళనాడులో మాత్రమే మంచి ఆదరణ లభించింది. రెండవ పార్టుకి మాత్రం ఇతర భాషల్లోను ఆదరణ లభిస్తోంది. ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఇంతవరకూ 300 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

ఈ మధ్య కాలంలో ఇంతమంది స్టార్ హీరోలు .. హీరోయిన్స్ కలిసి నటించిన సినిమా ఇదేనని చెప్పాలి. మణిరత్నం ఈ సినిమాలో పాటలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఏఆర్ రెహ్మాన్ మాత్రం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. లాంగ్ రన్ లో వసూళ్ల పరంగా ఈ సినిమా ఎంతవరకూ వెళుతుందనేది చూడాలి. 

More Telugu News