మేనిఫెస్టో రగడ... రూ.100 కోట్ల పరిహారం కోరుతూ ఖర్గేకు వీహెచ్పీ లీగల్ నోటీసులు
- అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో
- 14 రోజల్లో పరిహారం చెల్లించాలని చండీగఢ్ యూనిట్ నోటీసులు
- మే 4న పంపిన నోటీసులకు కాంగ్రెస్ నుండి రాని సమాధానం
14 రోజుల్లోగా పరిహారం చెల్లించాలని కోరుతూ వీహెచ్పీ చండీగఢ్ యూనిట్, దాని యువజన విభాగం బజరంగ్ దళ్ మే 4న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులకు కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐ మాదిరి బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చేసిన కాంగ్రెస్ ప్రకటనను బీజేపీ ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విశ్వహిందూ పరిషత్ ఏకంగా పరువు నష్టం అంటూ లీగల్ నోటీసులు పంపించింది.