sense: మార్కెట్లలో బుల్ జోరు.. వరుసగా ఎనిమిదో రోజు లాభాలు

  • 242 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడు శాతం వరకు లాభపడ్డ టెక్ మహీంద్రా షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా కొంతమేర సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడి 61,354కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 18,148 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.92%), ఎన్టీపీసీ (2.56%), టాటా స్టీల్ (2.22%), మారుతి (2.14%), ఇన్ఫోసిస్ (2.00%). 

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.30%), భారతి ఎయిర్ టెల్ (-1.11%), టాటా మోటార్స్ (-1.01%), కోటక్ బ్యాంక్ (-0.89%).

More Telugu News