హిట్ టాక్ తెచ్చుకున్న పీఎస్2.. తొలి రోజు కలెక్షన్ ఎంతంటే..!
- నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ చిత్రం
- మొదటి రోజు ఇండియాలో రూ. 38 కోట్ల వసూళ్లు
- మణిరత్నం కలల ప్రాజెక్టు తొలి పార్టు సూపర్ సక్సెస్
ఈ చిత్రం మొదటి రోజున రూ. 38 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో రూ. 25 కోట్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో రూ. 3–4 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మరో రూ. 4-5 కోట్లు వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. వారాంతం అయిన శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, పీఎస్1 భారత్ లో దాదాపు రూ. 327 కోట్లు, విదేశాల్లో రూ.169 కోట్లు వసూలు చేసింది.