గూగుల్ ఉద్యోగులను కంట్రోల్ చేయలేక సుందర్ పిచాయ్ ఇబ్బందులు
- ‘ది ఇన్ఫర్మేషన్’ మీడియా సంస్థ కథనం
- ఉద్యోగులను తాను నియంత్రించలేకపోతున్నానని సుందర్ పేర్కొన్నట్టు వెల్లడి
- సుందర్ పిచాయ్ మేనేజ్మెంట్లో సమస్యలు ఉన్నట్టు పేర్కొన్న సంస్థ
లేఆఫ్స్ కారణంగా ప్రస్తుతం గూగుల్లో అస్థిర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు, గూగుల్కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధి లేకపోవడం కూడా కంపెనీపై ప్రభావం చూపిస్తోంది. గూగుల్ సంప్రదాయిక సెర్చ్ ఇంజన్ కంటే సమర్థవంతమైన ఏఐ ఆధారిత ఉత్పత్తులను ప్రత్యర్థి సంస్థలు రంగంలోకి దింపాయి. గూగుల్ ప్రకటనల ఆదాయంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుందన్న ఆందోళన సంస్థలో వ్యక్తమవుతోంది. ప్రకటనల ద్వారా గూగుల్కు ప్రస్తుతం ఏటా సుమారు 150 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని సమాచారం. అయితే, ఏఐ రాకతో ఈ రంగంలో గూగుల్ వెనకబడినట్టు కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం గూగుల్ ప్రకటనల ఆదాయం దండిగా ఉండటంతో పిచాయ్ మేనేజ్మెంట్ శైలిలో సమస్యలు ఉన్నప్పకీ గూగుల్ పెద్దలు పట్టించుకోలేదని ‘ది ఇన్ఫర్మేషన్’ సంస్థ ప్రచురించింది.