Chandrababu: చంద్రబాబు రోడ్ షో సందర్భంగా గాయపడ్డ వ్యక్తి మృతి

  • అమరావతి రోడ్ షో సందర్భంగా ఢీకొన్న రెండు బైకులు
  • మంటలు చెలరేగడంతో గాయపడిన వెంకటేశ్వర్లు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి
Man wounded during Chandrababu show dead

టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్ షో సందర్భంగా గాయపడ్డ అడుసుమిల్లి వెంకటేశ్వర్లు అనే కార్యకర్త ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే, అమరావతి రోడ్ షో సందర్భంగా రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వెంటనే మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో వెంకటేశ్వర్లు చిక్కుకున్నాడు. అతని శరీరం చాలా మటుకు కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లు స్వస్థలం అచ్చంపేట మండలం గ్రంధశిరి గ్రామం. వెంకటేశ్వర్లు మృతితో టీడీపీ శ్రేణులు ఆవేదనలో మునిగిపోయాయి.

More Telugu News