Vikram: 'PS-2' ఈవెంటులో కలర్ ఫుల్ గా మెరిసిన ఐశ్వర్య - త్రిష

  • భారీ చారిత్రక చిత్రంగా రూపొందిన 'PS-2'
  • ఈ నెల 28వ తేదీన పాన్ ఇండియా స్థాయి రిలీజ్ 
  • నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐశ్వర్య రాయ్ - త్రిష  

Ponniyin Selven 2 movie pre release event

మణిరత్నం తొలిసారిగా తెరకెక్కించిన భారీ చారిత్రక చిత్రమే 'పొన్నియిన్ సెల్వన్ 2'. మణిరత్నం - సుభాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను దిల్ రాజు తీసుకొస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను, నిన్నరాత్రి హైదరాబాదులో నిర్వహించారు.ఈ ఈవెంటుకి ఈ సినిమాలోని ప్రధాన తారాగణమంతా హాజరయ్యారు. విక్రమ్ .. కార్తి .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. త్రిష ఈ వేడుకలో సందడి చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ 'నందిని' పాత్రను పోషించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇది. ఈ పాత్రలో ఆమె చాలా అందంగా మెరిశారు. అలాగే ఈ వేడుకలోను ఆమె అందంగా కనిపిస్తూ, ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు. ఇక త్రిష ఈ సినిమాలో 'కుందవై' పాత్రను పోషించారు. ఈ పాత్రకి గల ప్రత్యేకత వేరు. ఈ కథను గురించిన తెలిసిన చాలామంది హీరోయిన్స్ ఈ పాత్ర కోసం కలలు కంటూ వచ్చారు. ఆ ముచ్చట తీరిన అతికొద్ది మంది కథానాయికల్లో త్రిష ఒకరుగా కనిపిస్తారు. గ్రీన్ కలర్ శారీలో ఆమె ఈ వేడుకలో మరింత గ్లామరస్ గా మెరిశారు. నిన్న జరిగిన వేడుకలో కెమెరాల కళ్లన్నీ ఈ ఇద్దరి చుట్టూనే తిరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Telugu News