Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 23 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 0.40 శాతం నష్టపోయిన నిఫ్టీ 
  • 1.99 శాతం పెరిగిన ఐటీసీ షేర్ విలువ
Markets ends in losses

ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగించాయి. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచుతూచి వ్యవహరించారు. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 59,655కి చేరుకుంది. నిఫ్టీ 0.40 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,624 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.99%), టీసీఎస్ (1.82%), విప్రో (1.42%), ఏసియన్ పెయింట్స్ (1.27%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.09%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.26%), మారుతి (-1.86%), టాటా స్టీల్ (-1.71%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.66%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.25%).

More Telugu News