ఏపీలో రేపు కూడా వడగాడ్పులు
- ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు
- పగటి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదు
- నేడు 126 మండలాల్లో వడగాడ్పులు
- రేపు 108 మండలాలపై వడగాడ్పుల ప్రభావం
దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, నేడు అత్యధికంగా అనకాపల్లి, ఎన్టీఆర్ , విజయనగరం జిల్లాల్లోని మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తన నివేదికలో వెల్లడించింది.