woman sets herself on fire: దేవుడు చెప్పాడంటూ తనకు తాను నిప్పు పెట్టుకున్న మహిళ.. హైదరాబాద్ లో ఘటన!

  • రాజేంద్రనగర్ లో రోడ్డుపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ
  • అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
  • పరిస్థితి విషమం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
woman her self sprays kerosene and sets fire in hyderabad

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ఈ రోజు ఉదయం రోడ్డుపైకి వచ్చిన మహిళ.. కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలిన గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. వివరాలను ఇన్ స్పెక్టర్ నాగేంద్రబాబు వెల్లడించారు. 

అత్తాపూర్ లో శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుని బతుకుతోంది. మెట్రో పిల్లర్ నంబర్ 133 వద్ద ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని తనకు తాను నిప్పు పెట్టుకుంది. దేవుడు చెప్పాడని శివాని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు. ఎస్సై శ్వేత ఘటనాస్థలిని పరిశీలించారు. తర్వాత శివానిని అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News