Errabelli: మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధం కావాలి: ఎర్రబెల్లి

Errabelli fires on Modi
షార్ట్స్‌లో చూడండి
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు తెలంగాణ ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని మోదీ అనడం సిగ్గు చేటని విమర్శించారు. గతంలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు బీఆర్ఎస్ సహకరించలేదా? అని ప్రశ్నించారు.

 తెలంగాణను ముంచి అదానీకి దోచి పెడతామంటే తామెందుకు సహకరిస్తామని అన్నారు. పదో తరగతి పేపర్లు లీక్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న బీజేపీ కుయుక్తులను కేసీఆర్ తెలివిగా తిప్పికొట్టారని అన్నారు.
Go Back to Shorts
Errabelli
BRS
Narendra Modi
BJP

More Telugu News